ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం

ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా చిల్పూర్ మండలం మారుమూల గిరిజన తండాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య చిత్రపటానికి గిరిజనులు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. ఎస్టీ సెల్ నియోజకవర్గ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటీ సభ్యుడు మాలోతు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గార్లగడ్డ తండా గ్రామ శివారు తండాలకు, ఫతేపూర్ నుండి కచ్చిర్ల తండా, సేవ్య తండా నుండి అబ్దుల్ నాగారం బిటి రోడ్డు నిర్మాణానికి రూ.4.66 లక్షలు, గార్ల గడ్డ తండా దుర్గమ్మ గుడి నుండి దేవుల తండా వరకు బీటీ రోడ్డు

నిర్మాణానికి రూ. 1.60 లక్షలు 
మంజూరు చేయడంతో ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం చేసినట్లు రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గార్లగడ్డ సర్పంచ్ తులసి, ఎస్టి సెల్ అధ్యక్షులు మాలోతు నవీన్ నాయక్, సోషల్ మీడియా కార్యదర్శి గుగులోత్ నాగేందర్,' చిల్పూర్ యూత్ అధ్యక్షులు భూక్యా విజయ్ గార్లగడ్డ యూత్ విజయ్ పతేపుర్ ఉమ్లా, వెంకటేష్, కాకాయ, చందర్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.