అన్నివర్గాల అభ్యున్నతి ప్రభుత్వ ధ్యేయం - మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

అన్నివర్గాల అభ్యున్నతి ప్రభుత్వ ధ్యేయం - మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,నిర్మల్: రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతి ప్రభుత్వ ధ్యేయం అని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. హజ్ యాత్రకు వెళ్ళే ప్రయాణికులకు వైద్య పరీక్షల నిర్వహణ కోసం స్థానిక ఐ ఎ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ముస్లింలను హజ్ యాత్రకు ప్రభుత్వమే పంపిస్తోందన్నారు. వారి యాత్ర శుభప్రదం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు, డాక్టర్ వేణు గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.