శంకరన్న ఇల్లు కూలిపోయింది - ఆనాటి ఉత్తర తెలంగాణ పీపుల్స్ వార్ కార్యదర్శి ఇల్లు

శంకరన్న ఇల్లు కూలిపోయింది  - ఆనాటి ఉత్తర తెలంగాణ పీపుల్స్ వార్ కార్యదర్శి ఇల్లు

ముద్ర,ఎల్లారెడ్డిపేట: ఆనాటి పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ కార్యదర్శి దొంత మార్కండీ అలియాస్ శంకరన్న ఇల్లు కూలిపోయింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట కు చెందిన దొంత మార్కండీ ఇల్లు అకాల వర్షానికి కూలిపోయింది. ఇంట్లో ఎవరు నివసించకపోవడంతో ప్రాణాపాయం కలగలేదు. ఈ మధ్యనే శంకరన్న పాత్రతో కూడిన విరాటపర్వం సినిమా తెరకెక్కించారు. శంకరన్న పాత్రలో దగ్గుబాటి రాణా హీరో పాత్ర పోషించాడు. మూడు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ ఉద్యమానికి ఆకర్షితుడై ఉద్యమంలో చేరి ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషిచేసి నిజామాబాదులో 1994లో జరిగిన ఎన్కౌంటర్లో అమరుడయ్యాడు. ఉద్యమ వీరుని ఇల్లు కురుస్తున్న అకాల వర్షానికి నేల కొరకడంతో కిషన్ దాస్ పేట గ్రామస్తులు బాధాకరం వ్యక్తం చేశారు.