నేతాజీ నగర్ లో స్వాతంత్య్ర దిన వేడుకలు

నేతాజీ నగర్ లో స్వాతంత్య్ర  దిన వేడుకలు

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కార్వాన్ డివిజన్ లోని నేతాజీ నగర్ లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ జరిగింది. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మహ్మద్ సర్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు ఏ అప్పారావు, వై నరేందర్ రెడ్డి, టీఎస్ ఆనందరెడ్డి, ఏ కృష్ణమూర్తి మాట్లాడుతూ  స్వాతంత్ర్య సముపార్జనకు కృషి చేసిన జాతీయ నాయకులకు జోహార్లు అర్పించారు. వారి స్ఫూర్తితో దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ నాయకులు కేవేబీ మురళీమోహన్, కే. ప్రభాకర్, ఫకృద్దీన్, పి. గంగాధరన్, ఎంవీ. రంగారెడ్డి, కే అబ్దుల్ మాలిక్, రామేశ్వర్ రెడ్డి,  సురేందర్, లింగాల శేఖర్, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.