ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన అపూర్వం
- సూర్యాపేటలో ఎగిరేది గులాబీ జెండా నే
- బిఆర్ఎస్ పాలనలో ప్రతి కుటుంబానికి లబ్ధి
- జగదీష్ రెడ్డి తోనే సూర్యాపేట అభివృద్ధి సాధ్యం
- ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే నాయకుడు జగదీశ్ రెడ్డి
- ముక్తకంఠంతో జగదీశ్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్న అందరికీ ధన్యవాదాలు
- కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి
- 35,34,46 వార్డ్ లలో సునీత జగదీష్ రెడ్డి ఇంటింటి ప్రచారం
ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట లొ 60 ఏళ్లలో కానీ అభివృద్ధిని పదేళ్లలోనే చేసి చూపించిన జగదీశ్ రెడ్డి తోనే సూర్యాపేట అభివృద్ధి సాధ్యమని ఆయన సతీమణి సునీత జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. జగదీష్ రెడ్డి కి మద్దతుగా పట్టణంలో గడపగడపకు ప్రచారం నిర్వహించిన సునితమ్మ బొట్టు పెడుతూ, మ్యానిఫెస్టో ను ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన సూర్యాపేటలో మంత్రి విజయాన్ని ఖాయం చేసిందని అన్నారు. సూర్యాపేట అభివృద్ధి ప్రదాత కు ముక్తకంఠంతో ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి ఏదో ఒక లబ్ధి చేకూరిందని అన్నారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే నాయకుడు జగదీశ్ రెడ్డి కి పార్టీలకు కురాళ్ళ కచ్చితంగా అండగా నిలబడి భారీ మెజార్టీని కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు. చివరి రోజు పట్టణంలోని 34 35 46వ వార్డులలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు.