ఈనెల 29న వనపర్తి కి మంత్రి కేటీఆర్ రాక

ఈనెల 29న వనపర్తి కి మంత్రి కేటీఆర్ రాక

ముద్ర, వనపర్తి ప్రతినిధి: ఈనెల 29న వనపర్తి కి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడానికి వస్తున్నారని వివరించారు. రూ.10 కోట్లతో వనపర్తికి అద్భుతమైన ఐటీ టవర్ త్వరలో ఐటీ టవర్ నిర్మాణానికి జీఓ వస్తుందన్నారు.వనపర్తికి దాదాపు రూ.200 కోట్లు మంజూరయ్యాయని,ఈ మధ్యకాలంలోనే బ్రిడ్జ్ లు, రహదారులు,చేపట్టడం భవనాలకు నిధులు కేటాయించటం జరిగిందిని,కందకం, డబల్ బెడ్రూం ఇండ్లు, ఓల్డ్ హాస్టళ్ల పునరుద్దరణ తదితర వనపర్తి పట్టణాభివృద్ది కోసం రూ.50 కోట్లు మంజూరు చేశామన్నారు.పెబ్బేరు పట్టణాభివృద్ది కోసం రూ.5 కోట్లు,పెబ్బేరు సంత అభివృద్ధి కోసం నిధులు వినియోగిస్తున్నామని,టఫ్ ఐడీసీ కింద నిధులు మంజూరు చేశామన్నారు.

నియోజకవర్గంలో అన్ని రహదారుల మీద భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని,జెర్రిపోతుల వాగు, రామాటాకీస్, గోపాల్ పేట, కంచిరావులపల్లి చాపల వాగు వద్ద బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తయ్యాయిన్నారు.వనపర్తిని జిల్లాను చేయడంతో పాటు మౌళిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని,ఇక్కడ నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కృషిచేస్తున్నామన్నారు.త్వరలోనే అక్రిడేషన్ జర్నలిస్టులకు ఇండ్ల ప్లాట్లు,అక్రిడేషన్, నాన్ అక్రిడేషన్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందిస్తున్నామని వివరించారు.దశలవారీగా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అందరికీ ఇంటి స్థలాలు కేటాయిస్తామన్నారు.పేదలైన జర్నలిస్ట్ లకు గృహలక్ష్మి, డబల్ బెడ్రూం ఇండ్లు, ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని,వనపర్తి జర్నలిస్ట్ భవన్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు.

తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వనపర్తి, పెబ్బేరులకు రూ.55 కోట్ల మంజూరు చేసిన ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.ఈ నెల 29న కేటీఆర్ రాక సందర్బంగా భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నామని అన్నారు.సభ విజయవంతానికి, వనపర్తి అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.ప్రజలు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేశారన్ని,ప్రజలిచ్చిన అవకాశంతో వనపర్తి అభివృద్ధికి కృషిచేశానని కేవలం ఐదేళ్లకాలంలో ఎక్కడా జరగనంత అభివృద్ధి చేసానని, ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రిగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యవసాయ శాఖకు వన్నె తెచ్చానని అన్నారు.ప్రజలు ఆశీర్వదించి మరోసారి గెలిపిస్తే వనపర్తిని బలమైన భవిష్యత్ కు పునాది వేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పెబ్బేరు వైస్ చైర్మన్ కర్రె స్వామి, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షులు కురుమూర్తి యాదవ్ తదితరులు.