నామినేషన్ అనంతరం కేసీఆర్ ను కలిసిన శాసన మండలి అభ్యర్థి దేశపతి శ్రీనివాస్ నామినేషన్..

ముద్ర తెలంగాణ బ్యూరో: శాసన మండలికి గురువారం నామినేషన్ వేసిన అనంతరం ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారిని  దేశపతి శ్రీనివాస్, కె. నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. తమకు ఎమ్మెల్సీ గా అవకాశమిచ్చినందుకు వారు సిఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం  వారికి శుభాకాంక్షలు తెలిపారు.