జులూరులో కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

జులూరులో కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ముద్ర భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి మండలం  జులూరు గ్రామపంచాయితీ అలినగర్ లో  యాదవ సంఘ కమ్యూనిటీ భవనానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం జూలూరు గ్రామంలో పర్యటించి ఫైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ఫూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు.  

ఈ సందర్భంగా  గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రజక సంఘం , కురుమ సంఘాల భవనాలకు  పునరుద్ధరణకు ఆమోదం తెలిపారు .