జులూరులో కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
![జులూరులో కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64a50f46d48d6.jpg)
ముద్ర భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి మండలం జులూరు గ్రామపంచాయితీ అలినగర్ లో యాదవ సంఘ కమ్యూనిటీ భవనానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం జూలూరు గ్రామంలో పర్యటించి ఫైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రజక సంఘం , కురుమ సంఘాల భవనాలకు పునరుద్ధరణకు ఆమోదం తెలిపారు .