రోడ్లు, బ్రిడ్జిలు మరమత్తులు చేపట్టాలని ఆదేశించిన ఎమ్మెల్యే 

రోడ్లు, బ్రిడ్జిలు మరమత్తులు చేపట్టాలని ఆదేశించిన ఎమ్మెల్యే 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: భారీ వర్షాలకు వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు మరమత్తులు చేపట్టాలని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాయికల్ పట్టణంలోని  పెద్ద చెరువు వద్ద గల అలగుళ్ల బ్రిడ్జి, మత్తడి వద్ద డ్యామేజ్ కాగా పరిశీలించిన ఎమ్మెల్యే తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. రాయికల్ పట్టణంలో పలు వార్డులలో తిరుగుతూ ప్రజా  సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, కౌన్సిలర్లు ఎలిగేటి లత, అనిల్, మహేష్ గౌడ్, అణ్వారి బేగం, సాయి కుమార్, మహేందర్, నాయకులు రామ్మోర్తి, బాబా, చింటూ మండల అధ్యక్షుడు కొళ శ్రీనివాస్, మరిపెళ్లి శ్రీను, ఏనుగు మల్లారెడ్డి, గన్నే రాజారెడ్డి తదితరులు ఉన్నారు.