పులిచింతల ముంపు బాధితులతో సమీక్ష సమావేశం

పులిచింతల ముంపు బాధితులతో సమీక్ష సమావేశం

పాల్గొన్న కలెక్టర్ వెంకట్రావు, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.

హుజూర్ నగర్, ముద్ర: హుజూర్ నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పులిచింతల ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యలపై అంశాలపై సమీక్ష సమావేశంల నిర్వహించారు. కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ వెంకట్రావు , ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి  పాల్గొని మాట్లాడుతూ పులిచింతల నిర్వాసితుల ఇబ్బందులపై జిల్లా కలెక్టర్ సమక్షంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం  ద్వారా అక్కడ ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళటం రెండు రాష్ట్రాలు కూర్చున్నప్పుడు ఈ సమస్యలపై పక్కన ఆంధ్రా రాష్ట్రానికి తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతుందని అన్నారు.

అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే పులిచింతల నిర్వాసితులకు ఏర్పాటుచేసిన ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.  పులిచింతల నిర్వాసిత మార్కు కంటే కూడా ఇంకా ఇప్పుడు స్టోరేజ్ పెరగడంతో కొందరి  భూమి కూడా నీట మునుగుతుండడంతో ఆ విషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తున్నట్టు తెలిపారు.. అంతేకాకుండా నియోజకవర్గస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిపై కూడా ఈ రివ్యూ మీటింగ్ లో చర్చించడం జరిగింది అధికారులకు కూడా అందుకు తగినట్లు.. చేస్తున్న పనితీరుపై కూడా కలెక్టర్ ఆరా తీశారు.. అధికారుల పనితీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.. కార్యక్రమంలో ఆర్డిఓ వెంక రెడ్డి, పులిచింతల అధికారులు శ్యాంసుందర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ యాకోబు, స్థానిక అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.