జానూతుల సుబ్రహ్మణ్య శాస్త్రి కి నివాళులు అర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి

జానూతుల సుబ్రహ్మణ్య శాస్త్రి కి నివాళులు అర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: స్ధానిక 45 వ వార్డు విద్యానగర్ ఇండేన్ గ్యాస్ ఆఫీసు ఎదురుగా వుండే జానూతుల సుబ్రహ్మణ్య శాస్త్రి, అర్చకుల సంఘం అధ్యక్షులు ఇటీవల మరణించడంతో గురువారం నాడు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వారి  నివాసానికి వెళ్లి వారి  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.   ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.  ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి క్ర్రపాకర్, మారిపెద్ది శ్రీనివాస్, జెడ్పిటిసి సంజీవ్ నాయక్, జానుతుల వెంకట వశిష్ఠ శర్మ,శ్రీనాధ్ శర్మ, సావిత్రి, దుర్గా ప్రసాద్, యల్లంబట్ల రమేష్ శర్మ, ఉప్పల ఉదయ్ శర్మ, పింగళి నాగరాజు శర్మ, వేదం గురునాధ శర్మ, చిలుకూరి లక్ష్మి నారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.