మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

ముద్ర,నూతనకల్ ఆగస్ట్ 3: నూతనకల్ మండల కేంద్రానికి చెందిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు జూలూరు కనకాచారి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు . గురువారం విశ్వకర్మ హక్కుల సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ మారోజు సోమాచారి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సంఘం తరఫున 50 కేజీల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకురాలు ఉపేంద్ర, కిరణ్ చారి, మద్దిరాల మండలం అధ్యక్షులు నాగరాజు చారి, నూతనకల్ మండల విశ్వబ్రాహ్మణ నాయకులు, జూలూరు కేశవ చారి, బాణాల రఘు తదితరులు పాల్గొన్నారు.