70 ఏళ్ల పరాయిపాలన లో ధ్వంసమైన పర్యావరణానికి వరం తెలంగాణ హరితహారం
- హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షి.
- సూర్యాపేట జిల్లా గాంధీనగర్ లో తెలంగాణ కు హరిత హరం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.
- తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం ఈటూరు లో శాసన సభ్యులు కిషోర్ కుమార్ తో కలిసి దశాబ్ది ఉత్సవాల లో బాగంగా హరితోత్సవ వేడుకల్లో పాల్గొని మెక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి.
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:- 70 ఏళ్ల పరాయిపాలన లో ధ్వంసమైన పర్యావరణానికి తెలంగాణ హరితహారం గొప్ప వరం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రం లోని గాంధీనగర్ లో తెలంగాణ కు హరిత హరం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం ఈటూరు గ్రామం లో హరితోత్సవం వేడుకలలో స్థానిక శాసన సభ్యులు, గాధరి కిషోర్ కుమార్ తో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ2014 కు ముందు అటవీశాఖ కే పరిమితమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని , పట్టించుకునే నాథుడే లేడన్నారు. కేసీఆర్ అయ్యాక తెలంగాణా ఉద్యమం నడిపించిన తీరు గానే, హరిత ఉద్యమం నిర్వహించి,తాను నమ్మిన ప్రకృతి పునరుజ్జీవనాన్ని తెలంగాణ సమాజంలోని ప్రతి ఒక్కరి మదికి ఎక్కేలా లా చేయటంలో సీఎం కేసీఆర్ గారి పాత్ర కీలకం అన్నారు.
దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం.. నేడు పచ్చని పంటలతో, మైదాన ప్రాంతం నిండుగా దట్టమైన చెట్లతో మూడమూచ్చటగా ఉన్నది అంటే , ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం వల్లే సాధ్యమైంది అన్నారు.తెలంగాణ పునర్నిర్మాణం అంటే.ప్రజల బతుకుచిత్రాన్ని మార్చడమే కాదు.. ధ్వంసమైన అడవులను పునరుద్ధరించడం, సకల జీవరాశులను సంరక్షించడం అని యావత్ దేశానికి సగర్వంగా చాటిచెప్పిన దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. అతి తక్కువ కాలం లో దేశం లో అత్యధిక గ్రీన్ రివల్యూషన్ సాధించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.తొమ్మిదేండ్లలో సూర్యాపేట జిల్లా లో 7 కోట్ల 50 లక్షలు మొక్కలు నాటగా, రాష్ట్ర వ్యాప్తంగా నాటిన 273.33 కోట్ల మొక్కలు చెట్లుగా మారి ఆక్సిజన్తోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి అన్నారు.9 విడత లో బాగంగా ఈ ఒక్క రోజే 2 లక్షల మొక్కలు నాటుతుండగా, వర్షాలు పడిన అనంతరం హరిత హరం కార్యక్రమమని వేగవంతం చేయనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
ఆధునిక సమాజం లో మానవుడి మనుగడ , ఆయు ప్రమాణాలు తగ్గడానికి ప్రధాన కారణం పర్యావరణ కాలుష్యమే అన్నారు. రోజు రోజు కు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనారోగ్యాలకు చెట్ల ను పెంచడం ద్వారానే అడ్డుకట్ట వేయవచ్చని హరిత హారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.హరిత తెలంగాణ సాధనలో 9 ఏళ్ల కేసీఆర్ నాయకత్వం లోని ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షి అని అన్నారు.భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు మంచి వాతావరణం అన్న మంత్రి , ఆకుపచ్చ తెలంగాణ కొరకు జరుగుతున్న ఉద్యమం లో స్కూల్ పిల్లల నుండి వయో వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుుపునిచ్చారు