రాజీనామాకు సిద్ధమైన త్రిపురావరం ఎంపీటీసీ....?
![రాజీనామాకు సిద్ధమైన త్రిపురావరం ఎంపీటీసీ....?](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64d60d2354ea2.jpg)
- చిచ్చు లేపిన బీసీ బందు...!
ముద్ర, అనంతగిరి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బందు పథకం అనంతగిరి మండల బి ఆర్ ఎస్ పార్టీలో చిచ్చు రగిలించింది. త్రిపురావరం గ్రామంలో బిసి బందులో భాగంగా తాను సూచించిన పేర్లు రాకుండా సదరు సర్పంచ్ సూచించిన పేర్లు రావడంతో ఎంపీటీసీ.కొత్త జానకి నారాయణరెడ్డి.అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో నేడు అందజేయున్నట్లు తెలుస్తుంది. కొన్ని అనివార్య కారణాలవల్ల రాజీనామా చేస్తున్నాను చెప్తున్నట్టుకి అసలైన కారణం ఇదేనని... తెలుస్తుంది... మండలంలో కొన్ని గ్రామాల సర్పంచులు కూడా తాము పంపించిన పేర్లు పరిశీలన లోకి తీసుకోకపోవడంతో. అసహనంగా ఉన్నట్లు తెలుస్తుంది నేడు కోదాడ పట్టణంలో జరిగే బీసీ బందు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కూడా పలుగురు ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం పార్టీలో చర్చనీయంగా మారింది. మొత్తానికి బీసీ బందు పథకం అనంతగిరి మండలంలో బి ఆర్ ఎస్ పార్టీలో దుమారం లేపుతుంది.... ఎంపీటీసీ రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో అందుబాటులో లేకపోవడంతో ఎంపీపీ కు ఎమ్మెల్యేకు అందించారు.