కాంగ్రెస్ కార్యకర్తకు ఆర్థిక సహాయం - టిపిసిసి ఉపాధ్యక్షురాలు పద్మావతి ఉత్తమ్
![కాంగ్రెస్ కార్యకర్తకు ఆర్థిక సహాయం - టిపిసిసి ఉపాధ్యక్షురాలు పద్మావతి ఉత్తమ్](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64afbd54c84f9.jpg)
హుజూర్ నగర్ టౌన్ ముద్ర: హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని గోవిందపురం గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కాంగ్రెస్ కార్యకర్త చుట్టగుల చల్లారావు కుటుంబానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు పద్మావతిఉత్తమ్ 2 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాముల శివారెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఇట్టి మల్ల బెంజిమెన్, 9వ వార్డు కౌన్సిలర్ బొల్లెదు ధనమ్మ, జైలు, దాసరి పున్నయ్య,కంకణాల పుల్లయ్య పాల్గొన్నారు.