ఈనెల 30న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సెలవు

ఈనెల 30న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సెలవు

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈనెల 30 జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు, విద్యాసంస్థలకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారిని, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఒక ప్రకటన తెలిపారు. అలాగే పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఎన్నికల పనులు నిర్వహించుకోవడానికి ఈనెల 29 కూడా సెలవుదినంగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.