తిరుమలలో చిక్కిన 5వ చిరుత

తిరుమలలో చిక్కిన 5వ చిరుత

ముద్ర, తెలంగాణ బ్యూరో : అటవీశాఖ అధికారులతో కలిసి టీటీడీ అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్ చిరుత’ సత్ఫలితాలను ఇస్తుంది.  తాజాగా టీటీడీ ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. బుధవారం రాత్రి నరసింహాస్వామి ఆలయం వద్ద ఐదో చిరుతను అటవీ శాఖ అధికారులు బంధిచారు. దీనిని మగ చిరుతగా అధికారులు భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో చిరుత సంచారం ఆనవాళ్లు కనిపించాయి.  మూడు నెలల వ్యవధిలో ఐదు చిరుతలు బోన్లకు చిక్కాయి. జూన్ 24, ఆగస్టు 14, ఆగస్టు 17, ఆగస్టు 28 తేదీల్లో నాలుగు చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు. తాజాగా ఈనెల 6న ఐదో చిరుతను కూడా బంధించారు.