‘అంగళ్లు’ ఈ నెల 20కి వాయిదా!

 ‘అంగళ్లు’ ఈ నెల 20కి వాయిదా!

ముద్ర, తెలంగాణ బ్యూరో : అంగళ్లు ఘటనలో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. కేసు పూర్తి వివరాలతో హాజరుకావాలంటూ ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. నీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న సమయంలో అంగళ్లు వద్ద అధికార, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో అధికార పార్టీ కార్యకర్తలు తమపై రాళ్లు విసిరారని, తన సెక్యూరిటీ సిబ్బంది కాపాడారని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఘర్షణలో ముదివేడు పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.