బీఆర్ఎస్ లో చేరిన బిజెపి యూత్ నాయకులు

బీఆర్ఎస్ లో చేరిన బిజెపి యూత్ నాయకులు

ముద్ర,హుజురాబాద్: పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో సోమవారం బిజెపి పార్టీకి చెందిన యూత్ నాయకులు కార్యకర్తలు సుమారు 200ల మంది  ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో  బిఆర్ ఎస్ లో చేరారు.బిజెపి  నుంచి బిఆర్ఎస్ లోకి చేరిన ముఖ్య నాయకులు జవ్వాజి కుమారస్వామి, యాద్గా అరవింద్, రాపర్తి అఖిల్, పొన్నాల అనిల్, ఎండి జానీ, విజయగిరి రాకేష్, కనుకుల రాజూ, గోనె రాజు, ప్రవీణ్ ,వీరస్వామి బ్రహ్మం, మహమ్మద్ పాషా, మహ్మద్ అసిఫ్ శ్రీకాంత్, బన్నీ, వంశీ, లతో పాటు 200 మంది ముఖ్య కార్యకర్తలు ఉన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్  పర్సన్ కనుమల్ల విజయ,కరీంనగర్ జిల్లా కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగిలి రమేష్, జమ్మికుంట వే చైర్మన్ దేశిని కోటి, మాజీ వైస్ ఎంపీపీ చుక్క రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.