కేటీఆర్ బహిరంగ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ నాయకులు...
![కేటీఆర్ బహిరంగ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ నాయకులు...](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_651bfeedbe885.jpg)
వెల్గటూర్, ముద్ర : జగిత్యాల జిల్లా, ధర్మపురి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరు కానుం డడంతో మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, మహిళలు మంగళవారం అక్కడికి భారీగా తరలి వెళ్లారు. ఈ మేరకు వారిని తీసుకువెళ్లేం దుకోసం ఇంచార్జీ నాయకులు బస్సులు, ఆటోలను వారికి సమకూర్చారు. కొందరు యువకులు ద్విచక్ర వాహనాలు, కారులల్లో తరలివెల్లారు. కాగా ఈ కార్యక్రమానికి తరలివెళ్లే ముందు వారందరు ఇన్చార్జిగా వ్యవహరించిన వారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఊపి, నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి తరిలివెల్లిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చల్లూరి రాంచందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు జూపాక కుమార్, వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్, నాయకులు గండ్ర విష్ణువర్ధన్ రావు, పెద్దూరి భరత్, కొప్పుల సురేష్, గాగిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, అల్లం దేవక్క తదితరులు ఉన్నారు.