యువజన కాంగ్రెస్ యాదద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడిగా బడ్డం వాసుదేవ రెడ్డి నియామకం

యువజన కాంగ్రెస్ యాదద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడిగా బడ్డం వాసుదేవ రెడ్డి నియామకం

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బద్దం వాసుదేవరెడ్డి నియమితులయ్యారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆయన శనివారం నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా బద్దం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, 2020లో జరిగిన ఎన్నికలలో తాను పోటీ చేసి 2050 ఓట్లతో జిల్లా కమిటీలో మొదటి ప్రధాన కార్యదర్శిగా గెలుపొందానని తెలిపారు. 

పార్టీ నిర్దేశించిన ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నానని, భువనగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి విజయం కోసం పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని అన్నారు. తన పనితీరును చూసి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన జడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నింగల ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టా గిరిష్ గౌడ్, ఎలిమినేట సురేష్, రాష్ట్ర కార్యదర్శి నరేష్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, గడ్డం బాలకృష్ణ గౌడ్, సురకంటి సత్తిరెడ్డి, గోలి నరేందర్ రెడ్డి తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.