ఆడ శిశువు మృతదేహం లభ్యం

ఆడ శిశువు మృతదేహం లభ్యం

ముద్ర ప్రతినిధి భువనగిరి : అప్పుడే పుట్టిన ఆడ శిశువు మృతదేహం లభ్యమైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శనివారం కలకలం లేపింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం లావణ్య అనే మహిళ పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో బిఎస్పి సమావేశంకు హాజరైంది. సమావేశం మందిరం నుండి బయటకు వచ్చి చూడగా కుక్కలు, పందులు ఆడ శిశువు మృతదేహాన్ని పిక్కు తింటున్నట్లు గమనించింది. కుక్కలను వెళ్లగొట్టి చూడగా అప్పటికే శిశువు మృతి చెందినట్లు గమనించింది. వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పట్టణ ఇన్స్పెక్టర్ సుధీర్ కృష్ణ సందర్శించి మృదేహాన్ని పరిశీలించి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఏరియా ఆసుపత్రిలో ఈ మధ్యకాలంలో గర్భవతుల లిస్టు, డెలివరీ లిస్ట్ సేకరించి దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు.