ఇప్తార్ విందు లో పాల్గొన్న  మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి

ఇప్తార్ విందు లో పాల్గొన్న  మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది
ముద్ర,వీణవంక: రంజాన్ పండుగ పర్వదిన  సందర్భంగా ముస్లిం సోదరులకు  రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ దుస్తుల ను చల్లూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్ లో అందజేశారు. అనంతరం ఉపవాస దీక్ష లో ఉన్న ముస్లిం తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇప్తార్ విందు లో పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం విషేశ కృషి చేస్తున్నదని అన్నారు. మండలం లోని మైనార్టీ ల సంక్షేమం కోసం తన వంతు సహాయ సాకారాలు అందిస్తామని తెలిపారు. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.