అధికారులు బాధ్యతతో పనిచేస్తేనే అభివృద్ధి: తేజస్ నందు లాల్ పవర్

అధికారులు బాధ్యతతో పనిచేస్తేనే అభివృద్ధి: తేజస్ నందు లాల్ పవర్

 ముద్ర ప్రతినిధి, వనపర్తి: వనపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలంటే అధికారులు బాధ్యతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. బుధవారం వనపర్తి పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం పక్కన పార్కు కోసం స్థలాన్ని పరిశీలించారు, అలాగే ఎం సి హెచ్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు.

పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సూపరింటెండెంట్, ఈ డబ్ల్యూ ఐ డి సి అధికారులను ఆదేశించారు. పట్టణంలో నిర్మించే రోడ్డు వెడల్పు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. గాంధీ చౌక్ లో రోడ్డు వైండింగ్ పని తనిఖీ చేసి, కొత్త ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను సందర్శించి మిగిలిన పండ్లను పూర్తి చేసి అప్పగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు దేశ నాయక్,  దానయ్య, సిబ్బంది పాల్గొన్నారు.