నా కోసం కాదు.. నా కొడుకు కోసం
![నా కోసం కాదు.. నా కొడుకు కోసం](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_64218713a1a65.jpg)
- గాంధీభవన్కు అందుకే వెళ్లా
- కాంగ్రెస్లో నేను చేరలేదు డీఎస్ లేఖ
ముద్ర, తెలంగాణ బ్యూరో : తాను కాంగ్రెస్లో చేరలేదని, చేరినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, తనను వివాదాల్లోకి లాగవద్దని సీనియర్ నాయకుడు డీ శ్రీనివాస్ అన్నారు. తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్లో చేరారని, ఆయన కోసం గాంధీభవన్కు వెళ్లానని, నాకు కూడా కండువా కప్పారన్నారు. ఒకవేళ తాను కాంగ్రెస్లో చేరినట్లుగా భావిస్తే రాజీనామా చేస్తున్నానంటూ లేఖ విడుదల చేశారు. ఈ లేఖతో పాటుగా ఒక వీడియోను సైతం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు లేఖ పంపినట్లుగా వెల్లడించారు.
ఈ సందర్భంగా డీఎస్ సతీమణి విజయలక్ష్మీ మాట్లాడుతూ రాజకీయాల కోసం డీఎస్ను వాడుకోవద్దని, ఇప్పటికే ఆయనకు ఓసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్నారు. కాంగ్రెస్ వాళ్లకు చేతులు జోడించి దండం పెడుతున్నానని, తమ ఇంటి వైపు రావద్దని కోరారు.