నా కోసం కాదు.. నా కొడుకు కోసం

నా కోసం కాదు.. నా కొడుకు కోసం
  • గాంధీభవన్​కు అందుకే వెళ్లా
  • కాంగ్రెస్​లో నేను చేరలేదు డీఎస్​ లేఖ

ముద్ర, తెలంగాణ బ్యూరో : తాను కాంగ్రెస్​లో చేరలేదని, చేరినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, తనను వివాదాల్లోకి లాగవద్దని సీనియర్​ నాయకుడు డీ శ్రీనివాస్​ అన్నారు. తన కుమారుడు సంజయ్​ కాంగ్రెస్​లో చేరారని, ఆయన కోసం గాంధీభవన్​కు వెళ్లానని, నాకు కూడా కండువా కప్పారన్నారు. ఒకవేళ తాను కాంగ్రెస్​లో చేరినట్లుగా భావిస్తే రాజీనామా చేస్తున్నానంటూ లేఖ విడుదల చేశారు. ఈ లేఖతో పాటుగా ఒక వీడియోను సైతం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ చీఫ్​ ఖర్గేకు లేఖ పంపినట్లుగా వెల్లడించారు.

ఈ సందర్భంగా డీఎస్​ సతీమణి విజయలక్ష్మీ మాట్లాడుతూ రాజకీయాల కోసం డీఎస్​ను వాడుకోవద్దని, ఇప్పటికే ఆయనకు ఓసారి బ్రెయిన్​ స్ట్రోక్​ వచ్చిందన్నారు. కాంగ్రెస్​ వాళ్లకు చేతులు జోడించి దండం పెడుతున్నానని, తమ ఇంటి వైపు రావద్దని కోరారు.