ఎదుగుదలను చూసే అక్రమ కేసులు: ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి
![ఎదుగుదలను చూసే అక్రమ కేసులు: ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి](https://mudranews.in/uploads/images/2023/12/image_750x_6588366832e55.jpg)
మోత్కూర్(ముద్ర న్యూస్): ఆరాధ్య ఫౌండేషన్ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే శ్రీకాంత్ రాజ్ పై అక్రమ కేసులు పెట్టారని ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి అన్నారు.ఆదివారం స్థానిక వై జే ఫౌంక్షషన్ హాల్ లో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ భూదాన్ పోచంపల్లీలో మాకు సర్వే నెంబర్ 33 లొ 17 గుంటల భూమి ఉందని అట్టి విషయమై మాట్లాడడానికి శ్రీకాంత్ రాజ్ అక్కడికి వెళ్లగా శ్రీకాంత్ రాజ్ పై తాగుబోతు అని,అంతర రాష్ట్ర ముఠా అని తప్పుడు కేసులు పెట్టరాని న్యాయం,అన్యాయం ఆ భగవంతుడే చేస్తాడని ఆమె అన్నారు.
ఆరాధ్య ఫౌండేషన్ పార్టీలకు అతీతంగా కేవలం పేదల కోసం మాత్రమే పని చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమములో ఆరాధ్య ఫౌండేషన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏ లక్ష్మణా చారి,బుంగపట్ల యాకయ్య, నల్లగొండ జిల్లా అధ్యక్షులు తాడోజు ఆచారి, మోత్కూర్ మండల అధ్యక్షుడు కురిమేటి యాదయ్యా,ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.