కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సూర్యాపేట ప్రతినిధి, ముద్ర: తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ కళ్యాణ లక్ష్మి .షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద కుటుంబాలకు అండగా ఉండాలని ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఆయన అన్నారు ఈ పథకంతో పేదింటి ఆడబిడ్డలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో సోమవారం నాడు తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్ పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని అన్నారు ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ఎంపీపీ నెమరు గోమ్ముల స్నేహలత సురేందర్రావు.

మున్సిపల్ వైస్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి. మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మినేని స్రవంతి సతీష్ కుమార్. జెడ్పిటిసి దుపటి అంజలి రవీందర్. పిఎసిఎస్ చైర్మన్ పాలేపు చంద్రశేఖర్ . మండల తహసిల్దార్ రమణారెడ్డి. వసాయఅధికారి  వెంకటేశ్వర్లు. ఎం పి ఓ కే మారయ్య  బిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కల్లట్లపల్లి శోభన్ బాబు కందుకూరి లక్ష్మయ్య. డైరెక్టర్లు వజ్జే శంకర్ తెడ్డు భాస్కర్. నాగారం సిఐ రాజేష్ నాయక్ ఎస్ఐ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు