ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ముద్ర, మల్యాల: మండలంలోని తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో పలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కళాశాలలో ఖాళీగా ఉన్న తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, భౌతిక, రసాయన, వృక్ష, జంతు శాస్త్రo పోస్టులకు అతిధి ఉపాధ్యాయులు, అలాగే పాఠశాలలో తెలుగు, హిందీ, ఆంగ్లము, సైన్స్ బోదిoచుటకు ఉపాధ్యాయులు, పిఈటి, స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు  ప్రిన్సిపల్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 6 లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు తమను, సంబందించిన వెబ్ సైట్ చూసుకోవాలని పేర్కొన్నారు.