కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె
  • మద్దతు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

భూదాన్ పోచంపల్లి,ముద్ర:-అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడ్క వెంకటేష్ అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడి టీచర్లు చేపట్టిన సమ్మెకు మండల కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి సిబ్బందితో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటుందని ఆరోపించారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మర్రి నరసింహ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, నాయకులు టింగిల్ కార్ వెంకటేష్, గునిగంటి రమేష్ గౌడ్, చిన్నలచ్చి లింగస్వామి, ఉడతల సాయిరాం, జింకల కుమార్, జింకల సూర్య తదితరులు పాల్గొన్నారు.