ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
  • 14 మందికి స్వల్ప గాయాలు

హుజూర్ నగర్ టౌన్ ముద్ర:హుజూర్ నగర్ పట్టణంలో ఆయిల్ ట్యాంకర్ ని బస్సు ఢీకొన్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కోదాడ నుండి మిర్యాలగూడ వెళ్తుండగా హుజూర్ నగర్ కొత్త బస్టాండు సమీపంలో వెనక నుండి ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ మితిమీరి వాహనం నడపడం వల్లనే గాయాలయ్యాయని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను 108 లో ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు ఈ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.