బిజెపి గ్రాఫ్ పడిపోయింది

బిజెపి గ్రాఫ్ పడిపోయింది
  • టిఆర్ఎస్ లో చేరతానని ప్రాధేయపడ్డ బండి సంజయ్
  • బిజెపికి ఉన్న మూడు సీట్లు కూడా రావు
  • సివిల్ సప్లయ్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలతో బిజెపి గ్రాఫ్ మొత్తం పడిపోయిందని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీందర్ సింగ్ మాట్లాడుతూ కాంట్రవర్సీ వర్డ్స్ తో పతాక శీర్షికలో ఉండాలన్న బండి ఆలోచన సరికాదని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఉన్న మూడు సీట్లు కూడా రావని అన్నారు. ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో ప్రచారం కు వెళ్లిన బండి సంజయ్ కి ఎదురుదెబ్బలే తగులుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరు కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాల గూర్చి బండికి చెప్తూ రివర్స్ అటాక్ చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధి కొరకు కేంద్రం నుండి ఏం నిధులు తీసుకొచ్చావో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరుతానని నన్ను ప్రాదేయపడిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాజకీయాలలోకి కుటుంబ సభ్యులను లాగడం విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడి లక్షణం కాదన్నారు. బిజెపి కాంగ్రెస్ రెండు కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయాలని బండి సంజయ్ ప్రచారం చేశాడని ఆరోపించారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఎక్కువ శాతం తెలంగాణకే వస్తున్నాయని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని హితువు పలికారు. ఈ సమావేశంలో నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కూర తిరుపతి తో పాటు పలువురు పాల్గొన్నారు.