ఘనంగా ఈద్ వేడుకలు

ఘనంగా ఈద్ వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ముస్లింల పవిత్ర పర్వదినం రంజాన్ వేడుకలు అత్యంత పవిత్రంగా నిర్వహించుకున్నారు. నెల రోజులుగా ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు రంజాన్ తో దీక్షలు విరమించారు. ఈ సందర్భంగా స్థానిక ఈద్గా వద్ద, చించోలి వద్ద నిర్మించిన నూతన ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు భారాస నేతలు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.