గీత కార్మికుని పరామర్శించిన మడ్డి అంజిబాబు

గీత కార్మికుని పరామర్శించిన మడ్డి అంజిబాబు

చిలుకూరు ముద్ర : చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గుండు వీరబాబు అనే గీత కార్మికుడు సెప్టెంబర్ 25 వ తారీకు సోమవారం ఉదయం ఏడు గంటలకు తాటి చెట్టు ఎక్కుతుండగా మోకుతెగి ప్రమాదవశాత్తు కింద పడటం జరిగింది, అతనిని  శుక్రవారం సూర్యాపేట జిల్లా కల్లుగీత సంఘం జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు పరామర్శించారు, ఆయన మాట్లాడుతూ తాటి చెట్టు ఎక్కుతుండగా మోకు తెగి ప్రమాదవశాత్తు కింద పడటం వల్ల కుడి మోకాలు దగ్గర కాలుకు తొంటిలో వెన్నుపూస ప్రక్కటెముకలు విరిగినవని, తలకు కాలుకు చేతులకు బలమైన గాయాలు కావడం వల్ల అతను మంచానికే పరిమితమైనాడని  తక్షణమే ప్రభుత్వం నుండి అతనికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని  ఆయన డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం చిలుకూరు మండల అధ్యక్షులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సొసైటీ అధ్యక్షులు మండవ  వీరస్వామి, పనస వెంకన్న , కల్లుగీత కార్మిక సంఘం నాయకులు గోపగాని వెంకన్న, మామిడి సైదులు, శేషు, తదితరులు పాల్గొన్నారు.