అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ - బీ ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు.

అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ - బీ ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు.

మెట్‌పల్లి ముద్ర: పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని. బీ ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు అన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయం ముందు జాతీయ జెండా ను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17 న భారత దేశంలో తెలంగాణ విలీనమైందని ఆనాటి పోరాటాన్ని కొన్ని పార్టీలు కులం, మతం పేరుతో తప్పుదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నాయని వారి కుట్రలు తిప్పికొట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడని అన్నారు. బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్గం గంగాధర్, వార్డ్ కౌన్సిలర్ ఒజ్జల బుచ్చిరెడ్డి, పార్టీ నాయకులు లింగంపల్లి సంజీవ్, పిప్పెర రాజేష్, షేక్ నవాబు, జావీద్, డాక్టర్ నాగభూషణం, బత్తుల భరత్, ఒజ్జల శ్రీనివాస్, జాజాల రాజగోపాల్, పిప్పెర శేఖర్ తదితరులు పాల్గొన్నారు