బాధిత కుటుంబానికి 5 వేల నగదు, నిత్యవసరాల అందజేత  - ఎల్లారెడ్డిపేట గౌడ్స్ యూత్ ఔదార్యం  

బాధిత కుటుంబానికి 5 వేల నగదు, నిత్యవసరాల అందజేత  - ఎల్లారెడ్డిపేట గౌడ్స్ యూత్ ఔదార్యం  

ముద్ర, ఎల్లారెడ్డిపేట: గత వారం  కారు బోల్తా పడి దుర్మరణం చెందిన గంట దుర్గయ్య గౌడ్ కుటుంబానికి గౌడ్స్ యూత్ 5వేల నగదు నిత్యవసరాల సరుకులు బాధిత కుటుంబానికి శుక్రవారం  అందజేశారు. ఎల్లారెడ్డిపేట  మండల కేంద్రంలోని కేసీఆర్ నగర్ కాలనీ నివాస గృహంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి  మనోధైర్యాన్ని కల్పించి 5వేల నగదు, 50 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు అందించారు. గంట దుర్గయ్య గౌడ్ అకాల మరణంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. భార్య రేణుక కూతుర్లు అక్షిత, ఆకాంక్ష, కొడుకు శ్రీకర్ గౌడ్ లు  ఉన్నారు. దుర్గయ్య గౌడ్ కుటుంబాన్ని  మంత్రి కేటీఆర్ ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గౌడ్స్ యూత్,ఎల్లారెడ్డిపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు గంట శ్రీనివాస్ గౌడ్ ,  గంట బాలా గౌడ్, చింతకింది కిషన్ గౌడ్, గంట శ్రీనివాస్ గౌడ్, గంట దేవయ్య గౌడ్, గంట ఎల్లా గౌడ్, వరదవెల్లి శ్రీనివాస్ గౌడ్, బుచ్చి లింగం సంతోష్ గౌడ్, మల్లుపల్లి రమేష్ గౌడ్, గంట శ్రీనివాస్ గౌడ్, వరద వెళ్లి నాగరాజుగౌడ్, గంట స్వామి గౌడ్, గంట వెంకటేష్ గౌడ్, గనగొని నర్సాగౌడ్,   చింతకింది శ్రీనివాస్ గౌడ్, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.