విగ్రహాల విద్వాంసకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయండి - సీసీ కెమెరాలను బిగించండి.  కాంగ్రెస్ పార్టీ

విగ్రహాల విద్వాంసకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయండి - సీసీ కెమెరాలను బిగించండి.  కాంగ్రెస్ పార్టీ

ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం మహాత్మా గాంధీ నందీశ్వర విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య బుధవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ విగ్రహం చేతిని మరియు నందీశ్వర విగ్రహాన్ని ధ్వంసం చేసిన  దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.అంతేకాకుండా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం విడ్డూరమన్నారు. మండలంలోని చిన్నచిన్న గ్రామాలలో సీసీ కెమెరాలు పనిచేస్తుండగా మండల కేంద్రంలో సూపర్ మార్కెట్లు బట్టల దుకాణాలు బంగారు దుకాణాలు ఉండగా దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లయితే భద్రత ఉంటుందన్నారు. ఇటు పోలీసులు కానీ అటు గ్రామపంచాయతీ పాలకవర్గం కానీ చొరవ తీసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి దేవయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు నాయక్ ,నాయకులు  గంట బుచ్చ గౌడ్, పందిర్ల శ్రీనివాస్ ,చెన్ని బాబు ,రమేష్, రాజేందర్,నాగరాజు, ప్రశాంత్ ,శ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్నారు.