దుబ్బాకలో పోచమ్మ దేవాలయ ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు
![దుబ్బాకలో పోచమ్మ దేవాలయ ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_64450872d7f98.jpg)
సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో జరుగుతున్న పోచమ్మ దేవాలయ ఉత్సవాల్లో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు ఆదివారం రోజున అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు అక్కడ వేసిన పెద్దపట్నంను పరిశీలించారు అనంతరం బోనాల ఉత్సవంలోను అమ్మవారిని దర్శించుకుని అంబేద్కర్ సంఘం సభ్యులకు 50 వేల రూపాయలను అందజేశారు. పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా పలువురు నాయకుల ఇండ్లకు వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలిశారు.