ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా రైతులతో ముఖాముఖి

ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా రైతులతో ముఖాముఖి

కిసాన్ జాగరన్ అధ్యక్షులు పోల్సాని సుగుణాకర్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : రైతుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా రేపు ఉదయం స్థానిక  కృషి భవన్ లో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కిసాన్ జాగరన్ అధ్యక్షులు పొల్సాని సుగుణాకర్ రావు తెలిపారు. రైతు ఆదాయ పెంపు, అధిక ఉత్పత్తి, విత్తనాలు, లాభసాటి పద్ధతులు, ఆదునిక యంత్రాల ఉపయోగం తదితర విషయాలపై రైతులతో అవగాహన కార్యక్రమాన్ని కిసాన్ జాగరన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగ నిపుణులు, యంత్రాల తయారీదారులు, విత్తన కంపెనీ ప్రతినిధులు పాల్గొని రైతులతో నేరుగా చర్చించనున్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.