ధర్మపురిలో ఘనంగా గోదాదేవి కల్యాణం

ధర్మపురిలో ఘనంగా గోదాదేవి కల్యాణం
Godadevi Kalyanam in Dharmapuri

జగిత్యాల, ముద్ర ప్రతినిధి: ధర్మపురిలో గోదాదేవి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ శేషప్ప కళావేదిక వద్దకు ఉత్సవ మూర్తులైన గోదా రంగనాథ స్వాములను ఊరేగింపుగా తీసుకొని వచ్చారు.  వేదికపై ఉత్సవమూర్తులకు వేద బ్రాహ్మణుల మంత్రోత్సవముల మధ్య  కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, ముత్యాల శర్మ ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసచార్యులు, కమిటీ సభ్యులు అక్కెనపల్లి సురేందర్, ఇనుగంటి రమా వెంకటేశ్వరరావు ,గండి పద్మ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.