దత్త సాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

దత్త సాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ముద్ర, బోయినిపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండలో దత్త సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా సోమవారం రోజున ఉదయం నుంచి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

దత్త సాయి కమిటీ అధ్యక్షులు ఉకుంటి కనకరెడ్డి మాట్లాడుతూ: అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని,సకాలంలో వర్షాలు కురిసి,పాడి పంటలు సమృద్ధిగా పండి,రైతుల జీవితాల్లో వెలుగులు నిండాలని,ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ సాయి బాబా ఆశీస్సులు ఉంటాయని ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమములో ట్రస్ట్ సభ్యులు,మహిళలు,పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి మొక్కులు తీర్చుకున్నారు.