బలిదానాలతో రాష్ట్రం వస్తే పేపర్ లీకేజీలతో బాధలు తప్పడంలేదు...

బలిదానాలతో రాష్ట్రం వస్తే పేపర్ లీకేజీలతో బాధలు తప్పడంలేదు...
  • సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి...
  • టి.యస్.పి.యస్.సి బోర్డు ఛైర్మెన్ బి జనార్దన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చెయ్యాలి...
  • డీసీసీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్...
  • కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో సిఎం దిష్టిబొమ్మ దహనం 


ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని డీసీసీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలో, గురువారం మండల కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని నిరసన వ్యక్తం చేస్తూ, రోడ్డుపై బైఠాయించి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం  చేశారు. ఈ సందర్బంగా డిసిసి జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత బలిదానాలు చేసుకుంటే ఈ పేపర్ లీకేజీ చాలా దౌర్భాగ్యకరం, నిరుద్యోగ యువత అనేక ఇబ్బందులు పడుతూ ఉద్యోగాల సాధనకోసం వేల రూపాయలు ఖర్చు చేసి సిద్ధం అవుతుంటే, మరోవైపు పేపర్ లీకేజీలు చేస్తూ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్ట పడి రాత్రి పగలు చదివిన పేద మధ్య  తరుగతి నిరుద్యోగుల పాలిట కేసీఆర్ పాలనా శాపం అయింది, ఎనభై శాతం బలహీన వర్గాలకు చెందిన వారు ఉద్యోగుల కోసం చూస్తుంటే పేపర్ లీకేజీ పై నోరుమేధపడం లేదు. ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ టి.యస్.పి.యస్.సి బోర్డు ఛైర్మెన్ బి జనార్దన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి, బోర్డుని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో జరిగే పరీక్షలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా జరిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి,  సర్పంచ్ లు రేవల్ల సత్యం గౌడ్, సరసాని తిరుపతి రెడ్డి,  ఉప సర్పంచ్ లు కొండ వెంకటేష్ గౌడ్, హరి, కిరణ్, శ్రీధర్, సీనియర్ నాయకులు  రాజారావు రామగౌడ్, రామ్ మోహన్ రెడ్డి, కొమురయ్య, గంగధర్, రమేష్, విజయ్, సత్తయ్య, దిలీప్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నేరళ్ల మహేష్, , తదితరులు పాల్గొన్నారు..