కొత్తపెల్లి వైష్ణవి ని సన్మానించిన డీఈవో

కొత్తపెల్లి వైష్ణవి ని సన్మానించిన డీఈవో

 శంకరపట్నం, ముద్ర జూన్ 23: శంకరపట్నం మండలం కేశపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో 10 జిపిఏ సాధించిన కొత్తపల్లి వైష్ణవిని "క్లాస్ మేట్ క్లబ్" వారి ఆధ్వర్యం లో శుక్రవారం జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు శాలువాతో ఘనంగా సన్మానించి బొకేను అందజేశారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య బోధన జరుగుతుందని అందుకు నిదర్శనమే పదవ తరగతిలో 10 జిపిఏ సాధించడం అన్నారు.

విద్యార్థులు తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ఉత్తమ ఫలితాలను సాధించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆరెపల్లి మమత గౌతమి ని డిఈవో అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో ఆ తరగతి ఉపాధ్యాయుడు ఇప్పలపల్లి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.