కాశీ విశ్వేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే..
![కాశీ విశ్వేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే..](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63dd0db046b99.jpg)
షాద్ నగర్, ముద్ర: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని కిషన్ నగర్ గ్రామ శివారులో జగద్గురు వీరశైవ ఆగమ పాఠశాలలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ఆలయం ప్రతిష్టాపించడం మనం చేసుకున్న పూర్వజన్మసుకృతమాన్నారు. ప్రజలందరికీ విశ్వేశ్వర స్వామి కృపా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని, ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు.