కాశీ విశ్వేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే..

కాశీ విశ్వేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే..
MLA inauguration of Kashi Visveswara Swamy statue

షాద్ నగర్, ముద్ర: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని  కిషన్ నగర్ గ్రామ శివారులో జగద్గురు వీరశైవ ఆగమ పాఠశాలలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ఆలయం ప్రతిష్టాపించడం మనం చేసుకున్న పూర్వజన్మసుకృతమాన్నారు. ప్రజలందరికీ విశ్వేశ్వర స్వామి కృపా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని, ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు.