ట్రాలీ ఆటో ఢీ ఒకరి మృతి
![ట్రాలీ ఆటో ఢీ ఒకరి మృతి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_644e820801e54.jpg)
స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్లులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన పెంటయ్య(50) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్ నుండి హనుమకొండ వైపు వెళుతున్న ఆటో ట్రాలీ జాపరకొండ పెంటయ్యను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేందర్ తెలిపారు.