బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కు పేటెంట్

బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కు పేటెంట్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:  నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ పరిశోధనకు కేంద్రప్రభుత్వ పేటెంట్ లభించింది. ఈ సందర్భంగా ఆయనను ట్రిపుల్ ఐటీ సిబ్బంది మంగళవారం ఘనంగా సత్కరించారు. "నోవెల్ ఇంటర్ లైన్ యూనిఫైడ్ పవర్ క్వాలిటీ కండిషన్ ఫర్ మల్టీ ఫీడర్ సిస్టమ్" పై ఆయన చేసిన మూడేళ్ల పరిశోధనకు ఈ పేటెంట్ హక్కులు లభించాయి. ఇవి ఇరవై ఏళ్ల పాటు ఆయనకు చెందుతాయి.