బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కు పేటెంట్
![బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కు పేటెంట్](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6422de792afce.jpg)
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ పరిశోధనకు కేంద్రప్రభుత్వ పేటెంట్ లభించింది. ఈ సందర్భంగా ఆయనను ట్రిపుల్ ఐటీ సిబ్బంది మంగళవారం ఘనంగా సత్కరించారు. "నోవెల్ ఇంటర్ లైన్ యూనిఫైడ్ పవర్ క్వాలిటీ కండిషన్ ఫర్ మల్టీ ఫీడర్ సిస్టమ్" పై ఆయన చేసిన మూడేళ్ల పరిశోధనకు ఈ పేటెంట్ హక్కులు లభించాయి. ఇవి ఇరవై ఏళ్ల పాటు ఆయనకు చెందుతాయి.