అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముద్ర,ముషీరాబాద్: అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. అధికారులు సైతం పనులు ఎలా సాగుతున్నాయి అనే దానిపై నిఘా పెట్టాల న్నారు.భోలక్ పూర్ డివిజన్ లోని రంగానగర్ లో 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనునున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ గౌసుద్దీన్ తో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ డివిజన్లో ఇప్పటివరకు నూతన డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్లు ఏర్పాటు చేయించామని, ఇప్పుడు రోడ్ల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస రావు, నాయకులు జై సింహా, మొహమ్మద్ అలీ, జునేద్ బాగ్దాది, రహీం, శంకర్ గౌడ్, ఉమాకాంత్, పబ్బా కృష్ణ, మక్బూల్, జబ్బార్, కృష్ణ, ఎల్లేష్, కె ఏం సాయి, సురేందర్, సునీల్ , జిహెచ్ఎంసి డిఈ సన్నీ తదితరులు పాల్గొన్నారు.