మనస్ఫూర్తిగా....వెబ్ సినిమా చిత్రీకరణ

మనస్ఫూర్తిగా....వెబ్ సినిమా చిత్రీకరణ

హుజూర్ నగర్ టౌన్ ముద్ర:హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో మంగళవారం మనస్ఫూర్తిగా వెబ్ సినిమాను చిత్రీకరించారు. శ్రీ శ్రీనివాస ఆర్ట్ క్రియేషన్ బ్యానర్ పై  తిరుప్  వేల్పుల దర్శకత్వంలో నిర్మిస్తున్న మూడో షెడ్యూల్ ను దేవాలయంలో చిత్రీకరణ చేశారు. హీరో విజేత సాయి హీరోయిన్ ప్రియాలు నటిస్తున్న సినిమాకి సంబంధించి పలు సన్నివేశాలను దేవాలయ ఆవరణలో చిత్రీకరణ చేశారు. సెప్టెంబర్ 4 నుండి అక్టోబర్ మొదటి వారం వరకు మొదటి వారం వరకు ఈ సినిమాను పూర్తి చేయని లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సినిమా దర్శకులు తిరుఫ్ తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కథ నేపథ్యంలో  పలు సన్నివేశాలు చిత్రీకరించారు. మూడో షెడ్యూల్  ప్రారంభోత్సవంలో డీసీఎంఎస్ డైరెక్టర్ దొంగల వెంకటేశ్వర్లు క్లాప్ కొట్టి అభినందించారు. 

ఈ కార్యక్రమంలో సర్పంచ్ షేక్ సలీమా, ఆలయ కమిటీ చైర్మన్ గండు సైదులు, ఈవో లక్ష్మణరావు, ఆర్టిస్టులు మచ్చా ఉపేందర్, మచ్చా వెంకటేశ్వర్లు, అంకతి రవికుమార్, కోల నాగేశ్వరరావు,యరగని, రామస్వామి, అరుణ్ కుమార్ దేశముకు,  వంకాయల స్వాతి,చెన్న లక్ష్మి, అసోసియేట్ డైరెక్టర్ కన్నబోయిన సత్యనారాయణ, కోలా నాగేశ్వరరావు, గోపాలం, గట్టు శరత్ కుమార్, గోవిందరెడ్డి, ఎరగాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు.