రాజీవ్గాంధీకి ఘన నివాళి
![రాజీవ్గాంధీకి ఘన నివాళి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6469f7af8217a.jpg)
ముద్ర ప్రతినిధి, జనగామ: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనగామ ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి టీపీసీసీ మెంబర్ చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు ఉడత రవి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగాజీ జనగామ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికె ఇందిరా ముఖ్య అతిథులుగా హాజరై రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జనగామ మండల ప్రధాన కార్యదర్శి సలేంద్రి శ్రీనివాస్, జనగామ జిల్లా నాయకులు బడికే కృష్ణ స్వామి, జనగామ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని జయ, నాయకులు ఎండి ఆజాద్, యాసరపు పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.
కొమ్మూరి వర్గీయుల ఆధ్వర్యంలో...
కొమ్మూరి క్యాంపు కార్యాలయంలో కూడా రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర కోఆర్డినేటర్ సుంకరి శ్రీనివాస్ రెడ్డి, బచ్చన్నపేట మండలం సింగిల్ విండో మాజీ చైర్మన్ జిల్లెల సిద్ధారెడ్డి, యూత్ కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షుడు బనుక శివ రాజ్ యాదవ్, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగాల నర్సిరెడ్డి, పట్టణ సీనియర్ నాయకులు ఆలేటి సిద్దిరాములు, బోట్ల నర్సింగరావు, పిట్టల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.