సంక్షేమ పథకాలపై కేంద్ర మంత్రి సమీక్ష
![సంక్షేమ పథకాలపై కేంద్ర మంత్రి సమీక్ష](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_646a2a45ca580.jpg)
సిద్దిపేట : ముద్ర ప్రతినిధి భారత ప్రభుత్వ పశుసంవర్ధక, మత్స్య, డైరీ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ఆదివారం నాడు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ పశుసంవర్ధక, మత్స్య, డైరీ శాఖలలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష జరిగింది.
ఈ సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్, పశుసంవర్ధక, మత్స్యశాఖ, విజయ డైరీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.