రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయాలి.

రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయాలి.

ముద్ర ,పాలకీడు:-తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు పాతూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు హామీలను ఇస్తూ హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు. విడతల వారీగా మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అది కూడా అమలు చేయడంలేదని రుణమాఫీ అమలు కాకపోవటం వల్ల రైతులపై తీవ్ర వడ్డీ భారం పడుతున్నదని వాపోయారు. కొన్ని బ్యాంకుల్లో రైతుబంధు డబ్బులను రుణం కింద జమ చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి లక్ష రూపాయలు లోపు రుణమున రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు .లేని యెడల రైతాంగాని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.ధర్నా అనంతరం స్థానిక తాసిల్దార్ కి వినతిపత్రం అందించారు .ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కందగట్ల అనంత ప్రకాష్ ,పిఎసిఎస్ వై చైర్మన్ పగడాల మట్టేష్ ,రైతు నాయకులు ఎర్రడ్ల మల్లారెడ్డి, ఆర్లపూడి వీరభద్రం ,గుర్రం ధన మూర్తి ,మాతంగి ఏసురత్నం, మాజీ సర్పంచ్ మీసాల కాశయ్య ,కొండా పెద్ద ఎల్లయ్య ,కీసర మల్లయ్య, చాపల మల్లయ్య మ రైతులు పాల్గొన్నారు.